నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి.
అభిమానుల అంచనాలకు తగినట్లే విడుదలైన తొలిరోజు నుంచే మంచి వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.
GOD OF MASSES has conquered the US Box Office 🔥🔥
VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses $ 1M+ and is continuing its glorious run 💥
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/eL6vwuMVO7
— Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023