Sai Dharam Tej Accident: ‘ఈ సమయంలో రాజకీయాలు చేయకండి’

11 Sep, 2021 19:04 IST|Sakshi

యంగ్‌ హీరో సాయిధరమ్ తేజ్‌ నిన్న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెగా మేనల్లుడి ప్రమాద విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా, సాయిధరమ్ తేజ్‌ప్రమాదంపై సీనియర్‌ నటుడు నరేశ్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు సాయి తమ ఇంటి నుంచే బయలు దేరారని, సాయి ధరమ్‌ తేజ్‌ ఆయన అబ్బాయి నవీన్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పారు.

చదవండి: మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య

అంతేగాక వారు క్రమంగా బైక్‌ రేసుల్లో పాల్గొంటున్నారంటూ నరేశ్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ నరేశ్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు’ అనే క్యాప్షన్‌తో ఆయన తన ట్విటర్‌లో ఓ వీడియో వదిలారు.  అంతేగాక వీడియోలో ‘సాయి ధరమ్‌ తేజ్‌ మంచి వ్యక్తి. చక్కగా షూటింగ్‌లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన గురించి ఏవేవో మాట్లాడటం సరైనది కాదు. ఆయన కోలుకుని పూర్తి ఆరోగ్యం తిరిగి రావాలని దేవుడిని కోరుకోవాలి. అంతేకాని ఏవోవే వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు.

చదవండి: Sai Dharam Tej's Accident : సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై స్పందించిన నరేశ్‌

నరేశ్‌ గారు మీరు ఇలాంటి సమయంలో ఆయన కోలుకోవాలని పరమేశ్వరుని పార్థించండి. అంతేగాని బైక్‌ రేసులు చేశాడు అవి ఇవి అని ఎందుకు మాట్లాడటం సర్‌. ఈ సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు’ అంటూ బండ్ల వ్యాఖ్యానించారు. కాగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ రోజు ఉదయం వైద్యులు వెల్లడించగా ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారంటూ ఓ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయనను డాక్టర్‌ తట్టిలేపుతుండగా సాయి చేయి కదిల్చిన విజువల్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు