Puneeth Rajkumar: పునీత్‌కు బసవశ్రీ అవార్డు

4 May, 2022 11:51 IST|Sakshi

సాక్షి, బళ్లారి, యశవంతపుర: దివంగత పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు మరణానంతరం చిత్రదుర్గ మురుఘ మఠం 2021 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించడం తెలిసిందే. మంగళవారం బసవ జయంతి సందర్భంగా పునీత్‌ సతీమణి అశ్వినికి చిత్రదుర్గంలోని మురుఘ మఠంలో ప్రశస్తిని బహూకరించారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల చెక్కును పీఠాధిపతి డాక్టర్‌ శివమూర్తి మురుఘ స్వామి ఆమెకు అందజేశారు. మంత్రి బీసీ పాటిల్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

(చదవండి: పునీత్‌ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత)

మరిన్ని వార్తలు