రెండు కాలాల కథ

10 Oct, 2020 01:16 IST|Sakshi
అభినవ్‌ సర్దార్, రామ్‌కార్తీక్‌

అభినవ్‌ సర్దార్, రామ్‌కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో సైన్స్‌ఫిక్షన్‌ యాక్షన్‌ డ్రామాగా ‘పీనట్‌ డైమండ్‌’ సినిమా ప్రారంభమైంది. ఎఎస్‌పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్‌ పతాకాలపై ప్రొడక్షన్‌ నెం1 గా ప్రారంభమైన ఈ చిత్రం శుక్రవారం తొలి షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. వెంకటేశ్‌ త్రిపర్ణ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించడంతోపాటు హీరో అభినవ్‌ సర్దార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్, అభినవ్‌లు మాట్లాడుతూ– ‘‘1989లో ఒక కథ, 2020లో మరో కథ.. ఇలా రెండు కాలమానాలకి సంబంధించిన కథతో సాగే చిత్రమిది. ఈ చిత్రం తర్వాతి  షెడ్యూల్స్‌ని చెన్నై, వైజాగ్‌లలో చిత్రీకరిస్తాం’’ అన్నారు. చాందిని తమిళరాసన్, శానీ సల్మాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె. ప్రభాకర్‌ రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

మరిన్ని వార్తలు