యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ

2 Jun, 2023 00:19 IST|Sakshi
బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్‌ చంద్ర

శ్రీనివాస్‌ బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు పరశురామ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు హరీష్‌ శంకర్‌ క్లాప్‌ కొట్టి, డైరెక్టర్‌ పరశురామ్‌తో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు.

‘‘యూనిక్‌ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ఇది. శ్రీనివాస్‌ కెరీర్‌లో పదో చిత్రంగా రూపొందుతోంది. ఈ నెల రెండో వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: జిమ్షి ఖలీద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా.

మరిన్ని వార్తలు