Nirmala Mishra: గుండెపోటుతో సింగర్‌ మృతి

31 Jul, 2022 16:07 IST|Sakshi

ప్రముఖ బెంగాలీ సింగర్‌ నిర్మల మిశ్రా(81) ఇక లేరు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక అభిమానులు కడసారి సింగర్‌ను చూసి ఆమెకు నివాళులు అర్పించేందుకు వీలుగా నిర్మల పార్థివ దేహాన్ని రవీంద్ర సదన్‌కు తరలించారు. ఆమె మరణం పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా నిర్మల మిశ్రా 1983లో పశ్చిమ బెంగాల్‌లోని పరగనస్‌ జిల్లాలో జన్మించారు. ఎన్నో పాటలకు ప్రాణం పోసిన ఆమెను ప్రభుత్వం సంగీత్‌ సుధాకర్‌ బాలకృష్ణ దాస్‌ అవార్డుతో సత్కరించింది. ఒడియా, బెంగాలీ భాషల్లో ఆమె ఎన్నో పాటలు ఆడారు.

చదవండి: ఆ ఒక్క సినిమా వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయా
: సామ్‌.. పాత జ్ఙాపకాలను వీడలేకపోతుందా?  ఆ ఇంట్లోనే ఎందుకు?

మరిన్ని వార్తలు