చెక్‌ బౌన్స్‌ కేసు.. కన్నడ దర్శకుడి అరెస్ట్‌ 

14 Jan, 2023 19:40 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: శాండిల్‌వుడ్‌ దర్శకుడు గురుప్రసాద్‌ను గిరినగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. మఠ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న గురుప్రసాద్‌ చెక్‌బౌన్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యారు. శ్రీనివాస్‌ అనే వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేయటంతో పాటు అతడు ఇచ్చిన చెక్‌బౌన్స్‌ అయ్యింది.

దీంతో శ్రీనివాస్‌ కోర్టును ఆశ్రయించారు. దర్శకుడు  విచారణకు గైర్హాజరవ్వడంతో గురుప్రసాద్‌పై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు  గిరినగర పోలీసులు గురుప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం    బెయిల్‌పై విడుదలయ్యారు.

మరిన్ని వార్తలు