Akshara Singh: 'మార్ఫింగ్‌ చేశారు'.. ఎంఎంఎస్‌ వీడియోపై భోజ్‌పురి నటి కామెంట్‌

19 Sep, 2022 18:06 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన భోజ్‌పురి నటి అక్షర సింగ్‌. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉన్న ఈమె గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది. కొన్నిరోజుల క్రితం ఓ వ్యక్తితో రూమ్‌లో అశ్లీలంగా కనిపించిన అక్షర సింగ్‌ ఎంఎంఎస్‌ వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను చాలామంది నెటిజన్లు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోశారు. అయితే తాజాగా ఆ వీడియోపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆమె స్పందించింది.

ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉంది నేను కాదు. ఎవరో నా ఫోటోను మార్ఫింగ్‌ చేశారు. ఆ పని ఎవరు చేశారు అని కూడా నేను పట్టించుకోను ఎందుకంటే అందులో ఉన్నది నేను కాదు కాబట్టి. ఇప్పటివరకు నేను ఆ వీడియోను చూడలేదు. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నామీద ఎవరో కోపంతో ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉంటారు. కానీ ఇవి నన్ను ఏమాత్రం బాధించలేవు అంటూ చెప్పుకొచ్చింది. 

మరిన్ని వార్తలు