‘నమ్మలేకపోతున్నా.. ఇంత త్వరగా వెళ్లిపోయావు’

16 Jan, 2021 16:06 IST|Sakshi

బిగ్‌బాస్‌ 14 టాలెంట్‌ మేనేజర్‌ దుర్మరణం

ప్రముఖుల సంతాపం

ముంబై: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌-14 టాలెంట్‌ మేనేజర్‌ పిస్తా ధాకడ్‌(24) దుర్మరణం పాలయ్యారు. షూటింగ్‌ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బాలీవుడ్‌ భాయీజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ తాజా సీజన్‌కు పిస్తా ధాకడ్‌ టాలెంట్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌ ముగించుకుని తన అసిస్టెంట్‌తో కలిసి స్కూటీ మీద ఇంటికి బయల్దేరారు. రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. (చదవండి: అందరి కన్నూ ప్రధాని కుర్చీ మీదే..)

ఇంతలో అటుగా వస్తున్న వానిటీ వ్యాన్‌ పిస్తా మీద నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె అసిస్టెంట్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పిస్తా ధాకడ్‌ ఆకస్మిక మరణం పట్ల బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్లు, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పిస్తాతో కలిసి సరదాగా సమయం గడుపుతున్న వీడియోను పంచుకున్న నటి యువికా చౌదరి.. ‘‘ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్లిపోయావు ఎందుకు.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని నేను ప్రార్థిస్తున్నానంటే ఇంకా నమ్మలేకపోతున్నా బ్రో’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా బిగ్‌బాస్‌తో పాటు ఖత్రోంకీ ఖిలాడీ షోకు సైతం పిస్తా టాలెంట్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. 

A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary)

మరిన్ని వార్తలు