తొలివారం ఎలిమినేషన్‌; లిస్టులో గంగవ్వ!

12 Sep, 2020 11:57 IST|Sakshi

బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 తొలివారం ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లలో సూర్య కిరణ్‌, అభిజిత్‌, సుజాత, మెహబూబ్‌, దివి, అఖిల్‌ సార్థక్‌, గంగవ్వ ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారని బిగ్‌బాస్‌ ప్రోమో ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ఏడుగురికి కొన్ని టాస్కులు పెట్టి.. విజేతలుగా నిలిచిన కొందరిని బిగ్‌బాస్‌ సేవ్‌ అయినట్టుగా ప్రకటించే అవకాశముంది. మిగతావారిలో ఒకరు ఎలిమినేట్‌ కాక తప్పదు. నామినేషన్‌లో ఉన్నవారిలో ఎవరెవరు సేవ్‌ అవుతారో శనివారం నాటి ఎపిసోడ్‌లో వెల్లడవుతుంది.
(చదవండి: ఎనిమిదేళ్లలో లంబాడిపల్లి టు బిగ్‌బాస్‌..)

ఇదిలాఉండగా.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా కొత్తగా మరో ఇద్దరు కంటెస్టెంట్లను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వారిలో జ‌బ‌ర్ద‌స్థ్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్, ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్, 'జంప్ జిలానీ' హీరోయిన్ ‌స్వాతి దీక్షిత్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా గత సీజన్‌లో హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లు పెద్దగా ఆకట్టుకోలేదు. మూడో సీజ‌న్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నా సింహాద్రి తోటి కంటెస్టెంట్ల‌కు చుక్కలు చూపించింది. దీంతో రెండు మూడు వారాల్లోనే ప్రేక్షకులు త‌మ‌న్నాను బ‌య‌ట‌కు పంపించారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా శెట్టిని కూడా హౌజ్‌లోకి పంపించిన‌ప్ప‌టికీ అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్ష‌కులు కూడా ఆమెకు క‌నెక్ట్ అవ‌లేదు. దీంతో ఆమె కూడా వ‌చ్చిన‌దారినే తిరుగుముఖం ప‌ట్టింది. ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు