Bigg Boss Telugu 5: ఒసేయ్‌ ఉమా.. సిగ్గులేదా, థూ..: యానీ మాస్టర్‌ ఫైర్‌

15 Sep, 2021 19:11 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌ అన్న రేంజ్‌లో కొట్లాటలు జరుగుతున్నాయి. తొలివారం నుంచే నోటికి పని చెప్పిన కంటెస్టెంట్లు రెండోవారానికి వచ్చేసరికి చేతికి పని చెప్తున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ, ఎత్తిపడేస్తూ, కొడుతూ నానా అరాచకం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు మాత్రం తగ్గేదేలే అన్న రీతిలో ఫైట్‌ చేస్తున్నారు. కొట్టుకుందాం రా అంటూ కోట్లాది మంది ప్రేక్షకుల ముందే సవాలు విసురుతూ కుస్తీలు పడుతున్నారు. నాగార్జున 5 రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే ఏమో అనుకున్నాం గానీ మరీ ఇంత ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ ఉంటుందనుకోలేదంటున్నారు ప్రేక్షకులు.

ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం టాస్క్‌ నడుస్తోంది. ఇందులో ఇంటిసభ్యులు రెండు గద్ద, నక్క టీములుగా విడిపోయారు. నిన్న వీరి మధ్య నడిచిన మొదటి లెవల్‌ టాస్క్‌ పంతం నీదా నాదాలో ఇంటిసభ్యులు రెచ్చిపోయి మరీ ఆడారు. గాయాలపాలవుతున్నా ఏ ఒక్కరూ వెనకడుగు వేయకుండా ఆడారు. నేడు సాగరా సోదరా అనే రెండో లెవల్‌ టాస్క్‌ మొదలు కానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఈ టాస్క్‌లోనూ కంటెస్టెంట్ల మధ్య మరోసారి చిచ్చు రగిలినట్లు తెలుస్తోంది. ఉమాదేవి కొట్టిందని ఆరోపించిన సిరి ఏడ్చేయగా... ఆవేశంతో రగిలిపోయిన యానీ మాస్టర్‌ ఒసేయ్‌ ఉమా, సిగ్గు లేదా? థూ.. అంటూ నిప్పులు చెరిగింది. ఇక నటి ప్రియ.. తన మీదకొస్తే కాలితో తంతానని హెచ్చరించడం గమనార్హం. అయితే ఇలా తన్నించుకోవడానికి బిగ్‌బాస్‌ షోకు రాలేదని ఫైర్‌ అయింది శ్వేత. రసాభాసగా మారనున్న ఈ గేమ్‌లో ఏ టీమ్‌ గెలుస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు