Mehaboob Dil: 'వదిలి వెళ్లిపోయావ్‌.. ప్రతీక్షణం మిస్‌ అవుతూనే ఉంటాను'

6 Aug, 2022 20:01 IST|Sakshi

బిగ్‌బాస్‌ ​కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో మెహబూబ్‌ తల్లి మరణించింది. తల్లి మృతి పట్ల మెహబూబ్‌ ఓ సుధీర్ఘ పోస్టును షేర్‌ చేశాడు. ''అమ్మా.. నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్‌.. ఇకపై నేను నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మీ(అమ్మా)? నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదమ్మా.

నా ఒడిదుడుకుల్లో ఎల్లప్పుడూ అండగా నిలిచావు. నా ఎదుగులను చూసి మురిసిపోయావ్‌. మాకోసం సర్వస్వం త్యాగం చేశావ్‌. నువ్వు లేకపోతే మా జీవితాలు ఎటు వెళ్తాయో అర్థం కావడం లేదు. ప్రతీక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాను అమ్మా. జీవితం అంటే ఏంటో నేర్పించావు. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తుంటావని తెలుసు. నిన్ను గర్వపడేలా చేస్తానమ్మా.

తమ్ముడు, డాడీని బాగా చూసుకుంటానని మాటిస్తున్నాను. నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను''. అంటూ మెహబూబ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేశాడు. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు స్టే స్ట్రాంగ్‌ మెహబూబ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)

మరిన్ని వార్తలు