Bigg Boss OTT Telugu Non Stop: వరుస ప్రశ్నలతో కంటెస్టెంట్లను ఉక్కిరిబిక్కిరి చేసిన అనసూయ

13 May, 2022 17:56 IST|Sakshi

వరుస గెస్టులతో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో జిగేలుమంటోంది. మొన్నటిదాకా బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేయగా ఆ తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం టీమ్‌ హౌస్‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే నవ్వడానికి, నవ్వించడానికో ఆమె రాలేదు. ప్రేక్షకుల మనసులో మెదులుతున్న ప్రశ్నలను తూటాల్లా వదిలేందుకు వచ్చింది. ఈ సందర్భంగా మొదట అరియానాకు ఆడియన్స్‌ రాసిన ప్రశ్నను వదిలింది. 'ఫ్యామిలీ వీక్‌ తర్వాత బిందుకు క్లోజ్‌ అయ్యావు. ఎందుకు వుమెన్‌ కార్డు వాడుతున్నావు? సడన్‌గా ఎందుకిలా మారిపోయావు?' అని ప్రశ్నించింది. దీంతో అరియానా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇందులో ఉమెన్‌ కార్డు అనిపించిందంటే అది మీకే వదిలేస్తున్నా అని బదులిచ్చింది.

అనంతరం బిందును.. ఎప్పుడూ గ్రూప్‌ గేమ్స్‌ ఆడుతావు. కానీ అఖిల్‌ గ్రూప్‌ గేమ్స్‌ ఆడతాడని నిందిస్తావు. ఎందుకు? అని అడిగింది. అయితే బిందు మాత్రం ఎప్పుడూ గ్రూప్‌ గేమ్‌ ఆడలేదని కుండ బద్ధలు కొట్టింది. ఆ తర్వాత అఖిల్‌ వైపు తిరిగి.. వెకేషన్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు? గత వారం రోజులుగా బిందు గురించి నెగెటివ్‌గా మాట్లాడమే పనైపోయింది. కానీ ఫ్యామిలీ వీక్‌ తర్వాత బిందుతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు, ఎందుకు? అని అడిగింది. మరి దీనికి అఖిల్‌ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి! ఆ తర్వాత శివ వైపు చూసి 'ఎలా అనిపిస్తోంది? అడిగే దగ్గర నుంచి అడిగించుకునే దాకా?' అని సరదాగా అనడంతో అక్కడున్నవారంతా ఘొల్లున నవ్వారు.

చదవండి: ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్‌ కొన్న బుల్లితెర నటుడు

 నరకం చూపించారు, బర్త్‌డే రోజే నా కూతుర్ని చంపేశారు: మోడల్‌ తల్లి

మరిన్ని వార్తలు