Bigg Boss Telugu 6: ఎదుటివాళ్ల వీక్‌నెస్‌తో ఆడతావా? కామన్‌సెన్స్‌ లేదా?.. నాగ్‌

29 Oct, 2022 17:03 IST|Sakshi

బిగ్‌బాస్‌ ప్రోమో కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. హోస్ట్‌ నాగార్జున గీతూను పొగుడుతాడా? తిడతాడా? అని తెగ వెయిట్‌ చేస్తున్నారు. వారి ఎదురుచూపులకు బ్రేక్‌ ఇస్తూ తాజాగా ప్రోమో రిలీజైంది. వచ్చీరాగానే ఫుల్‌ ఫైర్‌ మీదున్నట్లున్నాడు నాగ్‌. ఫిజికల్‌ టాస్క్‌ ఇస్తే గుద్దిపడేస్తా అంది గీతూ.. మరి చేపల చెరువు టాస్క్‌లో గీతూ గుద్దిపడేసిందా? అని ఆదిని అడిగాడు నాగ్‌. దానికతడు బాగా ఆడిందని చెప్పగా మరెందుకు అందరికంటే తక్కువ చేపలు మీదగ్గరే ఉన్నాయని ప్రశ్నించాడు హోస్ట్‌.

గెలవడానికంటే కూడా అవతలివాళ్ల వీక్‌నెస్‌ మీద దెబ్బ కొట్టాలని చూశావని నాగ్‌ మీద ఫైర్‌ అయ్యాడు నాగ్‌. నేనుండే సీజన్‌లో వాళ్లు ఆడకపోయినా మనమే ఆడించాలని రెచ్చగొట్టానని ఆన్సరిచ్చింది గీతూ. గేమ్‌ ఇంట్రస్టింగ్‌గా చేయడం బిగ్‌బాస్‌ చూసుకుంటాడు. ఎవరి ఆట వాళ్లు ఆడితే సీజన్‌ ఎక్కడుండాలో అక్కడుంటుంది అని కౌంటరిచ్చాడు నాగార్జున.

నేను బయట కూడా గేమర్‌ సర్‌ అని గీతూ అనగా ఎదుటివాళ్ల వీక్‌నెస్‌ మీద ఆడటం గేమర్‌ కాదని గడ్డిపెట్టాడు నాగ్‌. సంచాలక్‌ అంటే అంపైర్‌ మాత్రమే, ఆటలో ఇన్వాల్వ్‌ అవ్వడానికి నువ్వెవరు.. నీ ఆట బొచ్చులో ఆట ఐపోయింది. కోపమొస్తే కామన్‌సెన్స్‌ కూడా కోల్పోతావా? అని తిట్టిపోసి ఆమెను శిక్షించాల్సిందేనన్నాడు. మరి గీతూకు ఎలాంటి పనిష్మెంట్‌ ఇస్తారనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: ఊహించని కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌
నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: కశ్మీర్‌ ఫైల్స్‌ నటుడు

మరిన్ని వార్తలు