Bipasha Basu: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు

12 Nov, 2022 15:30 IST|Sakshi

బాలీవుడ్ స్టార్ నటి బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఆమె 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పాప పాదాలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ' దేవి బసు సింగ్ గ్రోవర్' అంటూ రాశారు. గతంలోనే ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిపాసా బసు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేసింది. తాజాగా నవంబర్ 12న బిపాసా బేబీకి జన్మనివ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  

(చదవండి: తల్లి కాబోతున్న బిపాషా బసు?!)
 
బిపాసా, కరణ్ తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆగస్టులోనే ప్రకటించారు. కాగా ఈ జంట 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన 'ఎలోన్‌' సినిమాలో మొదటిసారి కనిపించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించడంతో డేటింగ్‌ కొనసాగించారు. ఆ తర్వాత ఈ జంట సుయాష్ రాయ్, నటాషా సూరి, సోనాలి రౌత్, నితిన్ అరోరా నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'డేంజరస్'లోనూ కూడా కలిసి నటించారు. గతవారమే ఆలియా భట్‌కు పాప పుట్టిన విషయం తెలిసిందే. 

A post shared by Bipasha Basu (@bipashabasu)

మరిన్ని వార్తలు