డ్రగ్స్‌ కేసు : అర్జున్‌ రాంపాల్‌కు ఎన్‌సీబీ నోటీసులు

9 Nov, 2020 16:09 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌కు నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎస్‌సీబీ) అధికారులు నోటీసులు అందజేశారు. బాలీవుడ్‌కి డ్రగ్స్‌కి లింక్‌ ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు అందజేశారు. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని రాంపాల్‌కు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. అంతకు ముందు ఎన్‌సీబీ అధికారులు అర్జున్‌ రాంపాల్‌ నివాసంపై దాడులు నిర్వహించారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలను ముగిసిన కొద్దిసేపటికే ఆయనకు సమన్లను జారీ చేశారు.

కాగా, ఆదివారం  ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా భార్యను అరెస్టు చేసి.. ఆ ఇంటినుంచి 10 గ్రాముల మార్జువానాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తమముందు ఈ నెల 8 న హాజరు కావాల్సిందిగా కోరుతూ ఫిరోజ్ కు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి.  బాలీవుడ్ కి చెందిన మరికొందరి ఇళ్లలో తాము  సోదాలు చేయనున్నామని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు