‘ట్రాజెడీ కింగ్‌’ కన్నుమూత

8 Jul, 2021 05:16 IST|Sakshi

ముంబై: విలక్షణ నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలీవుడ్‌ నట దిగ్గజం దిలీప్‌కుమార్‌ (98) తుది శ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసిన ఆయన.. అశేష అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచారు. పాత్రోచిత సహజ నటనకు, తనకే ప్రత్యేకమైన డైలాగ్‌ డిక్షన్‌ తోడై సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు యూసుఫ్‌ ఖాన్‌ అలియాస్‌ దిలీప్‌కుమార్‌ స్టార్‌గా వెలుగొందారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోవిడ్‌ ప్రొటోకాల్‌ నేపథ్యంలో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య, అధికారిక లాంఛనాలతో, శాంతాక్రుజ్‌లోని శ్మశానవాటికలో దిలీప్‌కుమార్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.

మృతదేహంపై త్రివర్ణ పతాకం కప్పి, గన్‌ సెల్యూట్‌తో తుది వీడ్కోలు పలికారు. నాటి ప్రముఖ నటి సైరా బాను దిలీప్‌కుమార్‌ భార్య. దిలీప్‌కుమార్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తమ ‘నిషాన్‌ ఇ ఇంతియాజ్‌’కు ఘనంగా నివాళులర్పించారు. మొఘల్‌ ఇ ఆజమ్, దేవదాస్‌ వంటి క్లాసిక్‌ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్‌’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్‌ యాక్టర్‌’గా దిలీప్‌ కుమార్‌ ఖ్యాతిగాంచారు. బాలీవుడ్‌ నట శిఖరాలు రాజ్‌కపూర్, దేవానంద్‌లతో కలసి త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వృద్ధాప్య సమస్యలతో గత మంగళవారం నుంచి దిలీప్‌ కుమార్‌ ముంబై ఉన్న హిందూజా ఆసుపత్రిలోని నాన్‌కోవిడ్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 7.30 గంటలకు దిలీప్‌కుమార్‌ కన్నుమూశారని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్‌ జలీల్‌ పార్కర్‌ ప్రకటించారు.

ఆ తర్వాత దిలీప్‌కుమార్‌ సన్నిహితుడు ఫైజల్‌ ఫారూఖీ ఇదే విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. ఆసుపత్రి నుంచి దిలీప్‌ కుమార్‌ మృతదేహాన్ని పాలిహిల్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, సహచర నటులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. వారిలో నటులు ధర్మేంద్ర, షబనా ఆజ్మీ, షారూఖ్‌ ఖాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు ఉన్నారు. ‘చాలా బాధగా ఉంది. నా సోదరుడిని కోల్పోయాను’అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ‘గొప్ప నట కౌశలం ఆయన సొంతం. తరాలకతీతంగా తనను ప్రేక్షకులు అభిమానించారు. సినీ దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, అశేష అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

భారతీయ సినీ రంగానికి దిలీప్‌ కుమార్‌ చేసిన అసాధారణ సేవలను భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకుంటాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘‘భారతీయ సినీ చరిత్రను ఎప్పుడు రాసినా.. అది దిలీప్‌ కుమార్‌ ముందు.. దిలీప్‌కుమార్‌ తరువాతగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఈ లోటును తట్టుకోనే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్‌ బచ్చన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్‌ కుమార్‌ అంత్యక్రియలు జరిగిన తర్వాత అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ శాంతాక్రుజ్‌ శ్మశానవాటికకు వెళ్లి నివాళులర్పించారు. యూసుఫ్‌ భాయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు సైరా బాను అన్నీ తానై సేవలు చేసిందని ప్రఖ్యాత గాయని లత మంగేష్కర్‌ పేర్కొన్నారు. ‘మా హీరోలకు దిలీప్‌కుమారే హీరో’అని నటుడు అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. తమ దేశంలో జన్మించిన దిలీప్‌ సాబ్‌కు పాకిస్తాన్‌ నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. పాక్‌ ప్రభుత్వం గతంలో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్‌ ఏ ఇంతియాజ్‌’ను కూడా బహూకరించింది. దిలీప్‌ కుమార్‌ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి అని పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రశంసించారు. ‘దిలీప్‌ సాబ్‌ మృతి వార్త కలచివేసింది. ఆయన గొప్ప విలక్షణ నటుడు. ఎస్‌కేఎంటీహెచ్‌కు నిధులను సమీకరించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన విలువైన సమయం కేటాయించి, నిధుల సమీకరణకు ఎంతో తోడ్పడ్డారు’అని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన తల్లి పేరుతో ఆసుపత్రిని నిర్మించిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 

పాకిస్తాన్‌లో జననం 
1922 డిసెంబర్‌ 11న నేటి పాకిస్తాన్‌లో ఉన్న పెషావర్‌లో యూసుఫ్‌ ఖాన్‌గా దిలీప్‌కుమార్‌ జన్మించారు. దిలీప్‌ కుమార్‌ తండ్రి లాలా గులామ్‌ సర్వర్‌ పండ్ల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వారి కుటుంబం బొంబాయికి తరలివచ్చింది. పండ్ల వ్యాపారంలో తండ్రికి సహకరిస్తున్న యూసుఫ్‌ ఖాన్‌ను నాటి ప్రముఖ నటి దేవికా రాణి సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరును దిలీప్‌ కుమార్‌గా మార్చారు. 1944లో వచ్చిన ‘జ్వార్‌ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ఆయన చివరి సినిమా. సామాజిక సేవా కార్యక్రమాల్లో, వరదలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాయం అందించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు.  

 
ఆరిఫ్‌ అల్వీ, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తమ ‘నిషాన్‌ ఏ ఇంతియాజ్‌’కు ఘనంగా నివాళులర్పించారు. మొఘల్‌ ఇ ఆజమ్, దేవదాస్‌ వంటి క్లాసిక్‌ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్‌’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్‌ యాక్టర్‌’గా దిలీప్‌కుమార్‌ ఖ్యాతిగాంచారు. బాలీవుడ్‌ నట శిఖరాలు రాజ్‌కపూర్, దేవానంద్‌లతో కలసి త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వృద్ధాప్య సమస్యలతో గత మంగళవారం నుంచి దిలీప్‌కుమార్‌ ముంబైలో ఉన్న హిందూజా ఆసుపత్రిలోని నాన్‌కోవిడ్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 7.30 గంటలకు దిలీప్‌కుమార్‌ కన్నుమూశారని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్‌ జలీల్‌ పార్కర్‌ ప్రకటించారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్‌ సన్నిహితుడు ఫైజల్‌ ఫారూఖీ ఇదే విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. ఆసుపత్రి నుంచి దిలీప్‌ కుమార్‌ మృతదేహాన్ని పాలిహిల్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, సహచర నటులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. వారిలో నటులు ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, షారూక్‌ ఖాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు ఉన్నారు. ‘చాలా బాధగా ఉంది. నా సోదరుడిని కోల్పోయాను’అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.  

‘గొప్ప నట కౌశలం ఆయన సొంతం. తరాలకతీతంగా తనను ప్రేక్షకులు అభిమానించారు. సినీ దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, అశేష అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగానికి దిలీప్‌ కుమార్‌ చేసిన అసాధారణ సేవలను భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకుంటాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘‘భారతీయ సినీ చరిత్రను ఎప్పుడు రాసినా.. అది దిలీప్‌ కుమార్‌ ముందు.. దిలీప్‌కుమార్‌ తరువాతగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఈ లోటును తట్టుకోనే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్‌ బచ్చన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్‌ కుమార్‌ అంత్యక్రియలు జరిగిన తర్వాత అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ శాంతాక్రుజ్‌ శ్మశానవాటికకు వెళ్లి నివాళులర్పించారు. యూసుఫ్‌ భాయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు సైరా బాను అన్నీ తానై సేవలు చేసిందని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ పేర్కొన్నారు. ‘మా హీరోలకు దిలీప్‌కుమారే హీరో’అని నటుడు అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. తమ దేశంలో జన్మించిన దిలీప్‌ సాబ్‌కు పాకిస్తాన్‌ నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. పాక్‌ ప్రభుత్వం గతంలో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్‌ ఏ ఇంతియాజ్‌’ను కూడా బహూకరించింది. దిలీప్‌కుమార్‌ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి అని పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రశంసించారు. ‘దిలీప్‌ సాబ్‌ మృతి వార్త కలచివేసింది. ఆయన గొప్ప విలక్షణ నటుడు. ఎస్‌కేఎంటీహెచ్‌కు నిధులను సమీకరించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన విలువైన సమయం కేటాయించి, నిధుల సమీకరణకు ఎంతో తోడ్పడ్డారు’అని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన తల్లి పేరుతో ఆసుపత్రిని నిర్మిం చిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 
పాకిస్తాన్‌లో జననం 
1922 డిసెంబర్‌ 11న నేటి పాకిస్తాన్‌లో ఉన్న పెషావర్‌లో యూసుఫ్‌ ఖాన్‌గా దిలీప్‌కుమార్‌ జన్మించారు. దిలీప్‌కుమార్‌ తండ్రి లాలా గులామ్‌ సర్వర్‌ పండ్ల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వారి కుటుంబం బొంబాయికి తరలివచ్చింది. పండ్ల వ్యాపారంలో తండ్రికి సహకరిస్తున్న యూసుఫ్‌ ఖాన్‌ను నాటి ప్రముఖ నటి దేవికా రాణి సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరును దిలీప్‌ కుమార్‌గా మార్చా రు. 1944లో వచ్చిన ‘జ్వార్‌ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ చివరి సినిమా. సామాజిక సేవా కార్యక్రమాల్లో, వరదలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల సమ యంలో సాయం అందించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. 

సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ సంతాపం 

దిలీప్‌ కుమార్‌ మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తంచేశారు. నటుడిగా దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి దిలీప్‌కుమార్‌ చేసిన సుదీర్ఘ సేవను  ఆయన గుర్తు చేసుకున్నారు. దిలీప్‌ మరణం దేశ చలనచిత్ర  రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, దిలీప్‌కుమార్‌ మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో దిలీప్‌కుమార్‌ ప్రత్యేక స్థానం సంపాదించారని, ఆయన పాత్రను మరువలేమని కొనియాడారు. పలు చిత్రాల్లో ఆయన నటన అద్వితీయం అని పేర్కొన్నారు న్నాళ్లుగా దిలీప్‌కుమార్‌ ఆరోగ్యం బాగుండలేదు. తుది దశకు చేరిన ప్రొస్టేట్‌ కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. చివరి రోజుల్లో ఎవరినీ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు.  

కొన్నాళ్లుగా దిలీప్‌కుమార్‌ ఆరోగ్యం బాగుండలేదు. తుది దశకు చేరిన ప్రొస్టేట్‌ కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. చివరి రోజుల్లో ఎవరినీ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు.  

మరిన్ని వార్తలు