Brahmanandam:పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రహ్మానందం కోడలు

27 Nov, 2022 19:08 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ బ్రహ్మానందం మరోసారి తాతయ్యాడు. బ్రహ్మీ తనయుడు, నటుడు రాజా గౌతమ్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. రాజా గౌతమ్‌- జ్యోత్స్న దంపతులకు ఇదివరకే పార్థ అనే బాబున్నాడు. తాజాగా ఈ జంట మరోపాపకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను అతడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు.

పార్థ తన చెల్లిని ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనికి 'రెట్టింపైన సంతోషం' అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇకపోతే బ్రహ్మానందం ముఖ్యపాత్రలో నటించిన పంచతంత్రం సినిమా డిసెంబర్‌ 9న రిలీజ్‌ కాబోతుంది.

A post shared by Raja Goutham (@rajagoutham)

చదవండి: మూడేళ్లుగా డిప్రెషన్‌లో, ఇంతలో గుండెపోటు: డైరెక్టర్‌
సోషల్‌ మీడియాలోకి స్టార్‌ హీరో భార్య ఎంట్రీ

మరిన్ని వార్తలు