‘అంటే సుందరానికీ’ నిర్మాణ సంస్థపై కేసు నమోదు

11 Jun, 2022 11:00 IST|Sakshi

అనుమతి తీసుకోకుండానే ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌, శ్రేయాస్‌ మీడియాపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని, నజ్రియా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని గురువారం మాదాపూర్‌ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా వెళ్లారు.

(చదవండి: ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ)

అయితే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ కల్యాణ్‌ లాంటి స్టార్‌ హీరో వస్తున్నప్పటీకీ.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శ్రేయాస్‌ మీడియా ఈ ఈవెంట్‌ని నిర్వహించింది. దీంతో నిబంధనలు ఉల్లఘించారంటూ శ్రేయాస్‌ మీడియా ఈవెంట్‌ మేనేజర్‌ సురేశ్‌తో పాటు మైత్రీ మూవీస్‌పై సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు