వజ్రం మెరిసె.. మగువ మురిసె..

5 Jan, 2021 08:58 IST|Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: అత్తాపూర్‌లో చిక్‌పెట్‌ డోనీ బిర్యానీ సెంటర్‌ను సోమవారం సినీనటి కేథరిన్‌ ప్రారంభించారు. వంటకాలను టేస్ట్‌ చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ప్రముఖ వ్యాపారవేత డి.రమేష్‌ హైదర్‌గూడ పిల్లర్‌ నంబర్‌–143 వద్ద ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

జూబ్లీహిల్స్‌: రోడ్‌ నంబర్‌-36లోని చందూభాయ్‌ గ్రూప్‌నకు చెందిన ది డైమండ్‌ స్టోర్‌లో వెడ్డింగ్‌ సీజన్‌ను పురస్కరించుకొని సరికొత్త బ్రైడల్‌ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అరుదైన ఆభరణాలను సోమవారం మోడల్స్‌ ప్రదర్శించారు. కోవిడ్‌ కారణంగా అందరి క్షేమం కోసం మా స్టోర్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు వర్చువల్‌గా కూడా ఆభరణాలు ఎంపిక చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తోందన్నారు. 


 

మరిన్ని వార్తలు