Chiranjeevi: చిరు ఇంట్లో టాలీవుడ్‌ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ భేటీ!

27 Feb, 2023 12:06 IST|Sakshi

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో మెగాస్టార్‌ చిరంజీవి, టాలీవుడ్‌ ప్రముఖులు సమావేశమయ్యారు. మంత్రి హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. చిరు ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి నాగార్జున అక్కినేని, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌తో కలిసి దిగిన ఫొటోలను చిరు షేర్‌ చేశారు.

చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్‌ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్‌

ఈ మేరకు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, వ్యక్తిగత, ఇతరత్రా అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు చిరు ట్వీట్‌ చేస్తూ.. ‘హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ మా ఇంటికి వచ్చారు. మాతో గడిపిన ఈ వీలువైన సమయానికి ఆయనకు ధన్యవాదాలు. ఈ సందరర్భంగా నా సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ, వేగవంతమైన పురోగతి గురించి ఆయన చర్చించడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైన సమావేశం నాకేంతో నచ్చింది’ అంటూ చిరు రాసుకొచ్చారు. 

మరిన్ని వార్తలు