ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ టీజర్‌

11 Jan, 2021 14:03 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠిలు జంటగా దర్శకుడు కౌశిక్‌ పెగల్లపాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రంలో కౌశిక్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి అనుకొని రీతిలో మంచి  రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ తాజా టీజర్‌ విడుదల చేసింది. ‘మీ ఆస్పత్రి సిస్టర్‌’ అంటగా అని సాగే డైలాగ్‌తో ఈ టీజర్‌ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి వెంట పడుతూ తనని ఏడుపిస్తున్న కొన్ని సీన్‌లతో ఉన్న ఈ టీజర్‌తో దర్శకుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా అల్లు ఆరవింద్‌ గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌లో బన్ని వాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మూవీ వేసవిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు