‘ఆచార్య’ థియేటర్స్లోకి వచ్చే తేదీని ఫిక్స్ చేసుకున్నారా? అంటే అవునంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. డేట్ ఫిక్స్ అయిందట. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. నిర్మించడంతో పాటు కీలక పాత్రలో నటిస్తున్నారు రామ్చరణ్. ‘ఆచార్య’ను వేసవిలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం గతంలో ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మే 9న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. చిరంజీవి నటించిన మెగాహిట్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మే 9న థియేటర్స్లోకి వచ్చింది. సో.. వార్తల్లో ఉన్న ప్రకారం ఆ లక్కీడేట్నే ‘ఆచార్య’ వస్తుందా? చూడాలి. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది.