ఆచార్య: మెగా అభిమానులకు డబుల్‌ ధమాకా

29 Jan, 2021 18:57 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు నేడు డబుల్‌ ధమాకా లభించింది. చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి మరో తీపి కబురు అందించింది చిత్ర యూనిట్‌. ఇంతకముందే(జనవరి 29) ఆచార్య టీజర్‌ను విడుదల చేయగా.. వెంటనే సినిమా విడుదల తేదిని కూడా ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మే 13న ఆచార్య థియేటర్లలో సందడి చేయనున్నట్లు హీరో రామ్‌ చరణ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ‘ ప్రపంచ వ్యాప్తంగా మే 13 నుంచి ఆచార్య థియేటర్లలో విడుదల కానుంది’ అని ట్వీట్‌ చేశారు. చదవండి: ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు

మరోవైపు శుక్రవారం విడుదలైన ఆచార్య టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. టీజర్‌లో చిరంజీవి, రామ్‌ చరణ్‌ చెప్పిన డైలాగులు అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక టీజర్‌.. సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చందమామ కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నెట్టింట్లో ఓ వైపు టీజర్‌ హవా నడుస్తుండగానే రిలీజ్‌ డేట్‌ కూడా కన్ఫార్మ్‌ చేయడంతో చిరంజీవి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకే రోజు రెండు అప్‌డేట్‌లు రావడంతో సినిమా కోసం రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. చదవండి: మెగాస్టారా మజాకా.. నిమిషాల్లో లక్షల వ్యూస్‌

మరిన్ని వార్తలు