Chiranjeevi - Ram Charan: చరణ్‌ని చూసి గర్విస్తున్నా.. చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

3 Dec, 2022 09:45 IST|Sakshi

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు ట్రూ లెజెండ్‌ అవార్డు రావడం పట్ల తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశాడు. గర్వంగా ఉందంటూ కుమారుడిపై సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ‘కంగ్రాట్స్‌ డియర్‌ చరణ్‌. ప్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియాలో ట్రూ లెజెండ్‌ అవార్డు నువ్వు అందుకున్నందకు గర్విస్తున్నా. నువ్వు ఇలాగే ముందుకు సాగాలని అమ్మా నేను కోరుకుంఉటన్నాం’ అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. దీనికి ‘లవ్‌ యూ అప్పా’ అని చరణ్‌ రిప్లై ఇచ్చాడు. 

కాగా, ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎన్డీటీవీ వివిధ రంగాల్లో విశేషమైన సేవలను అందించిన పలువురు ప్రముఖులకు ప్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా అవార్డులను ఆదివారం అందజేసింది. ఎంటర్‌టైన్‌ మెంట్‌ విభాగంలో రామ్‌ చరణ్‌కు ట్రూ లెజెండ్‌ అవార్డు లభించింది. ఈ అవార్డును చరణ్‌ తన తండ్రి చిరంజీవికి అంకితం చేశారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు