నో బ్రేక్‌ అంటున్న చిరంజీవి

17 Mar, 2021 08:06 IST|Sakshi

‘ఆచార్య’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలోపు తర్వాతి సినిమా చిత్రీకరణను ప్లాన్‌ చేస్తున్నారు చిరంజీవి. మలయాళంలో సూపర్‌ హిట్‌ సాధించిన ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నారట చిత్రదర్శకుడు మోహన్‌ రాజా. ఈ సినిమా కాకుండా బాబీ, మెహర్‌ రమేష్‌ దర్శకత్వాల్లో కూడా చిరంజీవి హీరోగా సినిమాలు తెరకెక్కనున్నాయి. సెట్స్‌లో ఒక సినిమా, కమిట్‌ అయిన మూడు సినిమాలతో చిరంజీవి బ్రేక్‌ లేకుండా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు.

చదవండి: యాంకర్‌ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం

మరిన్ని వార్తలు