కథ విన్నారా?

14 Apr, 2023 01:01 IST|Sakshi

హీరో చిరంజీవి, ‘బింబిసార’ ఫేమ్‌ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందా? చిరంజీవి కథ విన్నారా? అంటే ఫిల్మ్‌నగర్‌ అవునంటోంది. చిరంజీవికి వశిష్ఠ ఇటీవల ఓ కథ చెప్పారట.

ఆ స్టోరీ చిరంజీవిని ఇంప్రెస్‌ చేయడంతో ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట వశిష్ఠ. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇక ప్రస్తుతం ‘భోళా శంకర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు చిరంజీవి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు