ఉప్పెన హీరోకు చిరంజీవి గిఫ్ట్‌

11 Mar, 2021 12:18 IST|Sakshi

తొలి సినిమా ఉప్పెనతో సూపర్‌ సక్సెస్‌ అందుకుని గాల్లో తేలిపోతున్నాడు హీరో వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమా రిలీజై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అతడి మీద అభినందనల వర్షం కురుస్తూనే ఉంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి అయితే ఉప్పెన టీమ్‌ను కొనియాడటమే కాకుండా ఆ మధ్య చిత్రయూనిట్‌కు కానుకలు సైతం పంపాడు. ఈ క్రమంలో హీరోయిన్‌ కృతి శెట్టిని మెచ్చుకుంటూ లేఖ పంపాడు. అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు సైతం లేఖతో పాటు ఓ చిరు కానుక పంపాడు. మెగాస్టార్‌ నుంచి బహుమతులు అందుకున్న వీళ్లిద్దరూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. తాజాగా ఈసారి చిరు నుంచి కానుకను అందుకునే అదృష్టం వైష్ణవ్‌ తేజ్‌కు దక్కింది. చిరంజీవి తన మేనల్లుడికి ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆ గడియారాన్ని చేతికి ధరించిన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ థ్యాంక్స్‌ మామా అని రాసుకొచ్చాడు. 

సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన బుచ్చిబాబు సానా దర్శకుడిగా తొలి చిత్రం ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆయువుపట్టుగా నిలిచింది. క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాలను మెప్పించిన ఈ చిత్రం రూ.100 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది.

చదవండి: సెంచరీ మార్క్‌: రికార్డులు తిరగరాసిన ఉప్పెన

వైష్ణవ్‌ తేజ్‌ తొలి పారితోషికం ఎంతంటే?

మరిన్ని వార్తలు