Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవికి కరో​నా పాజిటివ్‌

26 Jan, 2022 09:43 IST|Sakshi

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది.  పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు వరుసగా కోవిడ్‌ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహేశ్‌బాబు, మంచు మనోజ్‌తో పాటు పలువురు హీరోలు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు.

‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ.. కరోనా బారిన పడ్డాను. నిన్న రాత్రి తేలికపాటి లక్షణాలతో కనిపించడంతో.. కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. త్వరలోనే మీ అందరిని తిరిగి కలుస్తా’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు