Ram Charan-Chiranjeevi: గుడ్‌ మార్నింగ్‌ అమెరికా షోలో చరణ్‌, చిరంజీవి ఏమన్నారంటే!

23 Feb, 2023 12:36 IST|Sakshi

ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘గుడ్‌మార్నింగ్‌ అమెరికా’ అనే పాపులర్‌ టీవీ షోలో చరణ్‌ పాల్గొననున్నారు. ఈ షో అమెరికన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 11.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ షో ద్వారా  తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో పంచుకోనున్నారు. 

చదవండి: చరణ్‌ బర్త్‌డే: మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇవ్వబోతున్న అల్లు అరవింద్‌

మరోవైపు కొడుకు అమెరికన్‌ ప్రాపులర్‌ షో పాల్గొనడంపై మెగాస్టార్‌ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. కొడుకు ఎదుగదల చూసి గర్వపడుతూ తాజాగా ఆయన ట్వీట్‌ చేశారు. ‘రామ్ చరణ్ గుడ్ మర్నింగ్ అమెరికా షో లో పాల్గొనడం తెలుగు / భారతీయ సినిమాకు గర్వకారణమైన క్షణం. దార్శనికుడు ఎస్ ఎస్ రాజమౌళి మెదడులో పుట్టిన ఒక ఉద్వేగభరితమైన ఆలోచన యొక్క శక్తి ప్రపంచాన్ని ఎలా చుట్టుముడుతుందో ఆశ్చర్యంగా ఉంది’ అంటూ తన ట్వీట్‌లో చిరు రాసుకొచ్చారు.

చదవండి: కేరళ హైకోర్టులో మోహన్‌ లాల్‌కు చుక్కెదురు!

అయితే అమెరికాలో అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన టీవీ షోలలో  ’గుడ్ మార్నింగ్ అమెరికా’ ఒకటి. ఈ పాపులర్ షోలో గతంలో టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ హీరోలు పాల్గొన్నారు. టాలీవుడ్‌ నుంచి పాల్గొన్న తొలి హీరోగా రామ్‌ చరణ్‌ రికార్డుకెక్కారు. గతంలో ఇండియా నుంచి ప్రియాంక చోప్రా, షారుఖ్‌ ఖాన్‌ ఈ పాపులర్ షో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు