Deepak Reddy: ‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్‌ ప్రశంసలు

10 Sep, 2022 07:29 IST|Sakshi
గిన్నీస్‌ బుక్‌ పత్రాన్ని సీఎం వైఎస్‌ జగన్‌కు చూపుతున్న దర్శకుడు దీపక్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘మనసానమః’ అనే లఘు చిత్రాన్ని రూపొందించి, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు సాధించిన యువ దర్శకుడు దీపక్‌ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ లఘు చిత్రం దాదాపు 900 పైగా పురస్కారాలు అందుకోవడంతో పాటు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తనను కలిసిన దీపక్‌ రెడ్డికి సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు గజ్జల శిల్ప నిర్మాణ బాధ్యతలు వహించారు.
చదవండి: చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్‌ జగన్‌  

మరిన్ని వార్తలు