కమిషనరేట్‌లో సెంథిల్‌ ఫిర్యాదు 

16 Jun, 2021 15:33 IST|Sakshi

తమిళసినిమా: సీనియర్‌ హాస్య నటుడు సెంథిల్‌ తన న్యాయవాదితో కలిసి  చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. ఎవరో తన పేరుతో నకిలీ ట్విటర్‌ను ప్రారంభించి వదంతులను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసినట్లు ఆ నకిలీ ట్విటర్‌లో పేర్కొన్నారని తెలిపారు. తన పేరుతో నకిలీ ట్విటర్‌ను ప్రారంభించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా తన పేరుతో ప్రారంభించిన నకిలీ ట్విటర్‌ అకౌంట్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి:
Akshay Kumar: పక్కా ప్లాన్‌.. రూ.1000 కోట్లు టార్గెట్‌!
సమంత కలర్‌పై విమర్శిస్తారని తెలుసు

మరిన్ని వార్తలు