మరోసారి హీరోగా చేయడానికి ఓకే చెప్పిన వడివేలు

29 Mar, 2021 10:33 IST|Sakshi

హాస్యనటుడు వడివేలు మరోసారి హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. తమిళంలో మరుదమలై, తలైనగరం సినిమాలను డైరెక్ట్‌ చేసిన సూరజ్‌ దర్శకత్వంలో వడివేలు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో స్టార్ట్‌ కానుందని కోలీవుడ్‌ సమాచారం. సూరజ్‌ డైరెక్ట్‌ చేసిన ‘మరుదమలై, తలై నగరం’ ఈ రెండు సినిమాల్లోనూ వడివేలు కీలక పాత్రల్లో నటించారు.

సో... ఇప్పుడు వడివేలు హీరోగా సూరజ్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఉహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇంతకుముందు ‘ఇమ్‌సై అరసన్‌ 23ఆమ్‌ పులికేసి’, ‘తెనాలిరామన్‌ ’ వంటి సినిమాల్లో వడివేలు హీరోగా నటించారు. అయితే తాను మరోసారి హీరోగా నటించనని కమెడియన్‌ వడివేలు గతేడాది ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు సినిమా అవకాశాలు వస్తుండటంతో మరోసారి హీరోగా నటించడానికి ఓకే చెప్పారు. 

మరిన్ని వార్తలు