Nayanthara-Vignesh Shivan: ఖర్చు లేకుండా నయన్‌ దంపతుల హనీమూన్‌ ట్రిప్‌? ఎలా అంటే..

27 Aug, 2022 08:57 IST|Sakshi

స్పెయిన్‌లో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ జంట హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తోంది. అయితే ఇందుకు ఆ జంట రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరి ఒక్క రోజు హోటల్‌ రూమ్‌ అద్దె రూ. 2.5 లక్షలట. ఇతర ఖర్చులు అదనం అని టాక్‌. ఈ జంటకు ఒక ప్రముఖ సంస్థ స్పాన్సర్‌ చేస్తోందని, ఫలితంగానే విదేశీ విహార యాత్ర చేస్తోందని గుసగుసలు. రీల్‌ జీవితంలో అందాలార బోతతో అభిమానుల్ని అలరించిన నయనతార నిజ జీవితంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ఆరేళ్లకు పైగా ప్రేమ, సహజీవనం చేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు రెండు నెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.

చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఈ పెళ్లి తతంగాన్ని ఓ ఓటీటీ సంస్థకి ప్రచార హక్కులను అమ్మేసి పెద్ద మొత్తంలోనే సంపాదించినట్లు తెలిసింది. పెళ్లి తరువాత విహార యాత్రల పేరుతో విదేశాలు చుట్టేసి ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ వారి రొమాంటిక్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు ఈ నవ దంపతులు. దీంతో అవి నెట్టింటలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేనికైనా హద్దంటు ఉంటుందని, మితిమీరితే వెగటు పుడుతుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకూ చేసింది చాలంటూ నెటిజన్లు నయన్‌ దంపతులపై ఫైర్‌ అవుతున్నారు.  

మరిన్ని వార్తలు