‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్‌: బెదిరింపులు కూడా వస్తున్నాయి!

21 Aug, 2021 11:28 IST|Sakshi
మాట్లాడుతున్న గుమ్మడి నర్సయ్య చిత్ర దర్శకుడు పరమేశ్వర్‌ (ఎడమ)  

 త్వరలోనే ‘గుమ్మడి నర్సయ్య’ చిత్రం షూటింగ్‌

మీడియాతో మాట్లాడిన చిత్ర యూనిట్‌

సాక్షి, ఇల్లెందు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని దర్శకుడు పరమేశ్వర్‌ వెల్లడించారు. ఇటీవల కారు బోల్తా పడగా ప్రమాదం నుంచి బయటపడిన గుమ్మడి నర్సయ్యను ఆయన శుక్రవారం ఇల్లెందులో పరామర్శించారు. ఆ తర్వాత యూనిట్‌ సభ్యుడు కృష్ణతో కలిసి పరమేశ్వర్‌ విలేకరులతో మాట్లాడారు. గుమ్మడి నర్సయ్య చిత్రం పోస్టర్‌ విడుదల చేసినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అంతేకాదు బెదిరింపులు కూడా వస్తున్నాయని వెల్లడించారు. అయితే, ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా ఓ ప్రజానేత జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ సినిమా విడుదలయ్యాకైనా నేతల్లో కొంత మార్పు వస్తుందనే ఆశ ఉందని చెప్పారు.
చదవండి: మాట్లాడుతున్న గుమ్మడి నర్సయ్య చిత్ర దర్శకుడు పరమేశ్వర్‌ (ఎడమ)  

మరిన్ని వార్తలు