ఓ క్రిమినల్‌ కథ

20 Aug, 2020 06:28 IST|Sakshi

మణికంఠ, సునీల్, పోసాని కృష్ణమురళి, అవి, భారత్, ఇంతియాజ్‌ ఉద్దీన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘క్రియేటివ్‌ క్రిమినల్‌’. ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి నర్సింగ్‌ గౌడ్‌ కెమెరా స్విచ్చా¯Œ  చేయగా, సునీల్‌ క్లాప్‌ ఇచ్చారు. పోసాని కృష్ణమురళి తొలి సన్నివేశానికి దర్శకత్వం చేశారు. ప్రభాస్‌ నిమ్మల మాట్లాడుతూ– ‘‘సస్పె¯Œ ్స క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. క్రిమినల్‌ నేపథ్యంలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని మొదట చిన్న బడ్జెట్‌ సినిమాగా చెయ్యాలి అనుకున్నా కథను బట్టి భారీగా నిర్మించబోతున్నాం’’ అన్నారు నర్సింగ్‌ గౌడ్‌. ‘‘ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అన్నారు సునీల్‌.  ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సలీమ్‌ మాలిక్, కెమెరా: గణేష్‌ రాజు.

మరిన్ని వార్తలు