Darshan: నిర్మాతను టార్గెట్‌ చేసిన దర్శన్‌ ఫ్యాన్స్‌

20 Jul, 2021 08:06 IST|Sakshi

యశవంతపుర: నటుడు దర్శన్‌ అభిమానుల నుంచి తనకు బెదిరింపు సందేశాలు, కాల్స్‌ వస్తున్నాయని దర్శక నిర్మాత ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఆరోపించారు. ఈ బెదిరింపులపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ... దర్శన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనను ఆయన అభిమానులు టార్గెట్‌ చేశారని, అశ్లీల సందేశాలు, కాల్స్‌ చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. 

సప్లయర్‌పై దాడి కేసులో విచారణ: మైసూరులో సందేశ్‌ ప్రిన్స్‌ హోటల్లో సప్లయర్‌పై నటుడు దర్శన్‌ దాడి చేసిన కేసు విచారణ వేగవంతం చేశారు.  పోలీసులు హోటల్‌ సిబ్బందిని మరోసారి విచారణ చేశారు. సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ పూర్తి అయ్యే వరకు పోలీసులు విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఓవైపు విచారణ జరుగుతుండగా మరోవైపు దర్శకుడు లంకేశ్, నటుడు దర్శన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

మరిన్ని వార్తలు