న్యూఢిల్లీ: జీవితంలో తాను ఎదుర్కొన్న సంఘటనలలపై బాలీవుడ్ నటి దీపిక పదుకొణే ఓ టీవీ షోలో పంచుకున్నారు. త్వరలోనే తాను షనల్ జియోగ్రఫిక్ షో(మెగా ఐకాన్స్లో) పాల్గొననున్నట్లు తెలిపింది. ఈ షోలో తన భర్త, నటుడు రణ్వీర్ సింగ్, కాక్టేల్ సినిమా దర్శకుడు ఇంతియాజ్ అలీ మెగా ఐకాన్స్ ప్రొగ్రామ్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో దీపిక పొల్గొంటున్న మెగా ఐకాన్స్ షో టీజర్ను విడుదల చేశారు. దీపిక స్పందిస్తు.. 2012లో విడుదలైన కాక్టేల్ సినిమా తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందని తెలిపింది.
కెరీర్ ప్రారంభంలో కెమెరా ముందు నటించాలంటే మొహమాటంగా ఉండేదని పేర్కొంది. అయితే కాక్టేల్ సినిమాలోను మొదటగా భయంగా నటించేదాన్ని, కానీ కొద్ది రోజులు నటించాక నటనలో సంతోషాన్ని గమనించానని పేర్కొంది. అప్పట్నుంచి నటన పరంగా వెనుదిరిగి చూడలేదని పేర్కొంది. అయితే తన జీవితంలో జరిగిన బావోద్వేగ సంఘటనలను దీపిక గుర్తుచేసిందని, ఆమె డిప్రెషన్తో బాధపడి కొద్ది కాలానికే డిప్రెషన్ను జయించిందని రణ్వీర్ ప్రశంసించాడు. మరోవైపు బాలీవుడ్లో అత్యంత వేగంగా నటనను మెరుగుపర్చుకున్న దీపిక పదుకొణే, అగ్రస్థానంలో ఉన్నట్లు ఇంతియాజ్ అలీ అభిపప్రాపడ్డాడు.
(చదవండి: దీపిక లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను: నటుడు)