Devatha : సత్య తల్లిదండ్రుల చావుకు కారణం ఎవరో రివీల్‌ చేసిన నందా

20 May, 2021 14:58 IST|Sakshi

సత్యకు తన జన్మరహస్యం చెప్పి నందా షాకిస్తాడు. అంతేకాకుండా తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం ఎవరో కూడా చెప్తాడు. మరోవైపు సత్యకు బ్రెయిన్‌ వాష్‌ చేశానని, ఇప్పుడు మొత్తం తను చెప్పిందే వింటుందని ఆదిత్యతో చెప్పి మరో ప్లాన్‌ వేసే పనిలో ఉన్నాడు నందా. మరి సత్య నిజంగానే నందా చెప్పినట్లు విని అతడి దగ్గరే ఉండిపోతుందా లేక భాగ్యమ్మ వాళ్లింటికి వెళ​ఉ వెళ్తుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ మే20నన  238వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేయడంతో సత్య రోడ్డున పడుతుంది. తన పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తన తల్లి భాగ్యమ్మకు ముఖం చూపించుకోలేక బాధపడుతుంది. ఇది గమనించిన నందా అక్కడికి చేరుకొని సత్యతో మాటలు కలిపే ప్రయత్నం చేస్తాడు. అయితే నందాను సత్య ఛీదరించుకుంటుండంతో ఎలాగైనా సత్య పొగరును అణచివేయాలని బావిస్తాడు. సత్య జన్మరహస్యం గురించి బయటపెట్టేస్తాడు. తన కన్నతల్లి భాగ్యమ్మ కాదన్న నిజాన్ని తనకు తెలుసని చెప్తాడు.  అంతేకాకుండా సత్య తల్లిదండ్రుల చావుకు కారణం కూడా భాగ్యమ్మ కుటుంబసభ్యులే అని చెప్పి సత్యకి ఊహించని షాకిస్తాడు. అయితే నిజమో కాదో అని ఆలోచిస్తుండగానే కావాలంటే మీ ఇంటికి వెళ్లి కనుక్కోపో అని నందా అని అంటాడు.

మొత్తంగా సత్యను ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి తను చెప్పింది వినేటట్లు డ్రామా క్రియేట్‌ చేస్తాడు. ఇక సీన్‌కట్‌ చేస్తే సత్య ఇంకా ఇంటికి చేరుకోలేదని తెలిసి రుక్మిణి కంగారు పడుతుంటుంది. సత్యకు ఏమవుతుందో అని భయపడిపోతుంటుంది. వెంటనే సత్యను వెతకాలని భర్త ఆదిత్యను కోరుతుంది. ఇక ఆదిత్య బయటకు వెళ్తుండగా నందా ఫోన్‌ చేసి సత్య ఇప్పుడు తన దగ్గరే ఉందని, తను చెప్పినట్లు వింటుందని చెప్పడంతో ఆదిత్య షాకవుతాడు. సత్యను ఏం చేయొద్దని వార్నింగ్‌ ఇస్తాడు. మరి సత్య నిజంగానే నందా చెప్పినట్లు విని అతడి దగ్గరే ఉండిపోతుందా లేక భాగ్యమ్మ వాళ్లింటికి వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తలు