Dhanush - Aishwaryaa Rajinikanth: విడాకుల తర్వాత తొలిసారి ఒకేచోట ఉన్న ధనుష్‌, ఐశ్వర్య

23 Jan, 2022 11:05 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌ ఒకేచోట ఉన్నారు. అదేంటి? వీళ్లిద్దరూ విడిపోయారు కదా! మరి ఒకేదగ్గర ఉండటం ఏంటి? అనుకుంటున్నారా? మరేం లేదు.. వ్యక్తిగత విషయాలతో డిస్టర్బ్‌ అయిన ఈ ఇద్దరూ అప్పుడే తమతమ పనుల్లో మునిగిపోయారు. ధనుష్‌ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉండగా అటు ఐశ్వర్య కూడా లవ్‌ సాంగ్‌ చిత్రీకరణ కోసం సిటీలో పాగా వేసింది.

చదవండి: కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన ధనుష్‌, అందుకే విడాకులు

అయితే వీరిద్దరు కూడా ఒకే హోటల్‌లో ఉంటున్నట్లు సమాచారం. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిటీకి వచ్చేసిన వీళ్లిద్దరూ రామోజీ రావు స్టూడియోలోని సితారా హోటల్‌లో బస చేస్తునట్లు తెలుస్తోంది. ఐశ్వర్య ప్రస్తుతం ఓ లవ్‌ సాంగ్‌ను డైరెక్ట్‌ చేస్తోంది. ఈ పాటను వాలంటైన్స్‌ డేకి రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. కాగా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 18 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉంటూ వచ్చిన ఈ దంపతులు 2022 జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు