Dhanush Sends Legal Notice: మదురై దంపతులకు షాక్‌ ఇచ్చిన ధనుష్‌.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’

22 May, 2022 08:10 IST|Sakshi

కదిరేశన్‌ దంపతులకు ధనుష్‌ నోటీస్‌

చెన్నై: మదురై మేలూరుకి వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేశారు. ఆ దంపతులు నటుడు ధనుష్‌ తమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. తమ జీవనాధారం కోసం నెలకు రూ.60 వేలు చొప్పున ఇవ్వాలంటూ ధనుష్‌కు నోటీసులు పంపారు. దీంతో ఈ వ్యవహారంలో తమకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామంటూ కదిరేశన్‌ దంపతులకు నటుడు ధనుష్‌ తన లాయర్‌ ద్వారా నోటీసులు పంపారు.   

మరిన్ని వార్తలు