అభిమానులతో కాసేపు మాట, మంతి, విందు అంటూ సరదాగా కాలక్షేపం చేశారు వర్ధమాన నటి దర్శాగుప్తా. నటీనటులు పాపులారిటీ పెంచుకోవడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలు పెద్ద వేదికగా మారాయి. అలా ఇన్స్టాగ్రామ్లో మిలియన్ ఫాలోయర్స్ను సంపాదించుకున్న నటి దర్శాగుప్తా. కుక్ విత్ కోమలి టీవీ ఈ కార్యక్రమం ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ బ్యూటీ ఇప్పుడు సినీ రంగంలోనూ తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.
ద్రౌపది వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ జీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం రుద్ర తాండవంలో కథానాయికగా దర్శాగుప్తా నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో అభిమానులను కలిశారు. వారందరితో కలసి దర్శాగుప్తా విందు ఆరగించి వారి ప్రశ్నలకు బదులిచ్చి సంతోషపరిచారు. ఇలా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్కు విందు ఇచ్చిన నటి దర్శాగుప్తానే అవుతారు.