'దిల్’ రాజు
‘‘తెలంగాణకి చెందిన పల్లెటూర్లో జరిగే కథ ‘బలగం’. మా సినిమా చూస్తే కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. వేణు చక్కగా తీశాడు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ప్రియదర్శి, కావ్య, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్, హన్షిత నిర్మించారు.