Dil Raju : హరీష్‌ శంకర్‌తో కలిసి దిల్‌రాజు వెబ్‌సిరీస్‌..

27 Jan, 2022 17:27 IST|Sakshi

Dil Raju And Harish Shankar Join Hands For Web Series: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు వెబ్‌ కంటెంట్‌పై దృష్టి పెట్టారు.  'ఏటీఎమ్ రాబరీ' అనే వెబ్ సిరీస్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కథను అందిస్తుండగా చంద్రమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి ఈ సిరీస్‌ను నిర్మించనున్నట్లు స్వయంగా దిల్‌రాజు ప్రకటించారు. ఇక హరీష్‌ శంకర్‌- దిల్‌రాజు కాంబినేషన్‌ కావడంతో ఈ వెబ్‌సీరిస్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. 

మరిన్ని వార్తలు