కుర్రాళ్ల గుండె చప్పుడు

29 Sep, 2020 06:33 IST|Sakshi

అలీతో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ చిత్రాన్ని తెరకెక్కించిన దిలీప్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘యూత్‌’. ‘కుర్రాళ్ల గుండె చప్పుడు’ అనేది ట్యాగ్‌లైన్‌. బాపట్ల పార్లమెంట్‌ సభ్యుడు నందిగం సురేష్‌ సమర్పణలో పెదరావురు ఫిల్మ్‌ సిటీ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. షూటింగ్‌ని తిరిగి గోవాలో ప్రారంభించారు.

దిలీప్‌ రాజా మాట్లాడుతూ– ‘‘గోవా బీచ్‌ దగ్గర కొన్ని ఛేజింగ్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. జనవరిలో చివరి షెడ్యూల్‌ను ఏపీలోని 13 జిల్లాల్లో చిత్రీకరించాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమా కథను, నటీనటుల వివరాలను ప్రస్తుతానికి బహిర్గతం చేయడం లేదు. ఈ సినిమా కాకుండా ‘తను నేనూ ఒక్కటే’ అనే టైటిల్‌తో మరో సినిమా రూపొందించనున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు