కరోనాకు ప్రముఖ దర్శకుడు బలి

26 May, 2021 09:00 IST|Sakshi

చెన్నై: సీనియర్‌ దర్శకుడు, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు మోహన్‌గాంధీ రామన్‌ మంగళవారం కరోనాతో కన్నుమూశాడు. కరోనా సోకడంతో కొద్ది రోజుల క్రితం ఓమందూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచాడు. ఈయన సెల్వియన్‌ సెల్వన్‌ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వాకృధి, ఆనందభైరవి, విమోచన సమరం, స్వర్ణ విగ్రహం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

చదవండి: ఎన్టీఆర్‌ వియ్యంకుడు కన్నుమూత

మరిన్ని వార్తలు