Director Parasuram: అదే సినిమాకి ప్లస్‌ అయ్యింది

13 May, 2022 07:53 IST|Sakshi

‘‘దేశ ప్రజలందరికీ కనెక్ట్‌ అయ్యే కథ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్‌ సెక్టార్, ఈఎంఐతో ఇబ్బందిపడని మధ్య తరగతి మనిషి ఉండరు. అలాంటి పాయింట్‌ని మహేశ్‌గారి లాంటి సూపర్‌ స్టార్‌తో చెప్పించడం సినిమాకి ప్లస్‌ అయ్యింది. రచయితగా, దర్శకుడిగా ఈ సినిమా నాకు తృప్తినిచ్చింది. మా సినిమాకి ప్రీమియర్‌ షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్లాక్‌ బస్టర్‌ స్పందన రావడం ఆనందంగా ఉంది. మహేశ్‌గారి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, క్లాస్‌.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చింది’’ అని పరశురాం అన్నారు.

చదవండి: బాలీవుడ్‌పై మహేశ్‌ కామెంట్స్‌, స్పందించిన బోనీ కపూర్‌, ఆర్జీవీ

మహేశ్‌బాబు, కీర్తీ సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ నిర్వహించిన ‘బ్లాక్‌ బస్టర్‌ మీట్‌’లో నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘మా రెండేళ్ల కష్టం బ్లాక్‌ బస్టర్‌ రెస్పాన్స్‌తో ఎగిరిపోయింది. అమెరికాలో ప్రీమియర్‌లో మిలియన్‌ డాలర్స్‌ని కలెక్ట్‌ చేసి నాన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులన్నీ క్రాస్‌ చేసింది’’ అన్నారు. వై. రవిశంకర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడంతా పాన్‌ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో ‘సర్కారువారి పాట’ లాంటి పెద్ద సినిమా మళ్లీ చూడగలమా? అంటే సందేహమే’’ అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

చదవండి: ‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే

మరిన్ని వార్తలు