అఘాయిత్యాలకు మహిళలే కారణం: దర్శకుడు కామెంట్స్‌

5 Jan, 2022 08:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మహిళలే కారణమని దర్శకుడు పేరరుసు పేర్కొన్నారు. రెయిన్‌బో ప్రొడక్షన్స్‌ పతాకంపై వరదరాజ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెన్‌ విలై వెరుమ్‌ 999 రూపాయ్‌ మట్టుమే’. నటుడు రాజ్‌కమల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది.

దీని యాక్షన్‌ రియాక్షన్‌ సంస్థ అధినేత జెనీష్‌ విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఇది మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ రూపొందించిన చిత్రం అని చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు