20 మంది మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారులతో సినిమా

7 May, 2022 08:40 IST|Sakshi

తమిళసినిమా: సమాజంలో సంఘీభావం చాలా అవసరమని దర్శకుడు పేరరసు పేర్కొన్నారు. 20 మంది మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘పోలామా ఊర్గోళం’. గజసింహ మేకర్స్‌ పతాకంపై ప్రభుజిత్‌ నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగరాజ్‌ బాయ్‌ దురైలింగం దర్శకుడు. మదుసూదన్‌ మరో హీరోగా నటిస్తున్న ఇందులో శక్తి మహేంద్ర నాయకిగా నటిస్తున్నా రు.

కాగా ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. సమాజంలో ఏం మాట్లాడినా కొందరు వివాదం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫుట్‌బాల్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు.

మరిన్ని వార్తలు