పవర్ ఫుల్ మూవీస్కు కేరాఫ్ అడ్రస్ శంకర్. గ్రాఫిక్స్ తో మాయ చేయడం తెలుసు.. పోలిటికల్ థ్రిల్లర్ తో సెన్సేషన్ సృష్టించడం కూడా తెలుసు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్టైగర్ ఎన్టీఆర్తో ఓ మూవీ చేయబోతున్నాడట. ఈ మేరకు నిర్మాత దిల్ రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(చదవండి: సీక్రెట్గా నటి పూర్ణ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్)
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాలతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత శంకర్తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్తో శంకర్ తెరకెక్కించే సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది.అక్కడ చరణ్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు శంకర్. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేసేందుకు శంకర్ సీరియస్ గా ట్రై చేస్తున్నాడు.
చరణ్ తో మూవీ తర్వాత కమల్ తో భారతీయుడు 2 షూట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత తారక్ తో చేయాల్సిన పైన సినిమా పైన శంకర్ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్, అలాగే టాలీవుడ్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకరు తారక్..వీరిద్దరూ చేతులు కలిపితే .. ఆ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటి అనేది ఊహించుకోవడం కష్టమే.